1. సింహాచలం వరాహ నరసింహుడు ( విశాఖపట్నం దగ్గర )
2. కోరుకొండ ( రాజమండ్రికి 20 కి.మి )
3. వేదగిరి యోగానంద నారసింహుడు ( విజయవాడకు 50 కి.మి )
4. మంగళగిరి శాంత నృసింహుడు ( విజయవాడకు 30 కి.మి )
5. పెంచలకోన ఛత్రవటి నరసింహ స్వామి ( నెల్లూరుకి 80 కి.మి )
6. అహోబలం నవనారసింహులు ( ఆళ్ళగడ్డకు 25 కి.మి. )
7. కదిరి లక్ష్మి నరసింహుడు ( అనంతపురానికి 90 కి.మి )
8. యాదగిరి గుట్ట లక్ష్మీ నారసింహడు ( హైదరాబాద్ దగ్గర )
9. మట్టపల్లి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ( నల్గొండ జిల్లా )
- సిమ్హాచలంలో ఉన్నమూర్తిని వరాహ నరసిమ్హమూర్తిగా కొలుస్తాము. సిమ్హాచల స్వామిది ఉగ్రరూపమని,ఆయన్ని శాంతింపచేసేందుకు చందనం పూసి,చందనం పూతతో శివలింగాకారంగా శ్రీ వరాహనరసిమ్హస్వామివారి రూపాన్ని పూజిస్తారు.
- విశాఖపట్నం జిల్లాలో సిమ్హాచలం ప్రముఖ క్షేత్రం, వేదవేద్యుడు గనుకనే వేదాద్రి,వేదగిరి,వేదాచలం,అంతర్వేది వంటి వేద సంబంధమైన పేర్లున్న ప్రాంతాలలో స్వామి నెలకొన్నాడు.
- యాదగిరి గుట్ట (వేదగిరి) రంగారెడ్డిజిల్లాలో ఉంది. కరీమ్నగర్ జిల్లాలోకూడా ఆ స్వామి కొలువై ఉన్నారు.
- పంచక్రోశక్షేత్రమైన అహోబిలం,కర్నూలు జిల్లా వద్ద ఉంది. ఇక్కడ నవ నరసిమ్హ రూపాలు ఉన్నాయి.
- కరంద నృసింహ
- యోగానంద నృసింహ
- ఉగ్ర నృసింహ
- వరాహ నృసింహ
- ప్రహ్లాదవరద నృసింహ
- చత్రపఠ నృసింహ
- మాలోల నృసింహ
- జ్వాలా నృసింహ
- పవన నృసింహ
- కదరి నరసీమ్హ క్షేత్రం అనంతపురం లో ఉన్నది. స్వామి ఉగ్ర రూపంలో అవతరించినప్పటికీ, భక్త వరదునిగా,భక్తుల పాలిట కల్ప తరువుగా ఎందరినో కరుణించిన కరుణామూర్తి. అందుకే మన మహర్షులు నరసీంహ తత్త్వాన్ని ఇలా చెప్పారు.
ఆ నాభేర్బ్రహ్మణోరూపం, ఆ గళాద్వైష్ణవం వపుః
ఆ శీర్షా ద్రుద్రమీశానాం, తదగ్రే సర్వతశ్శివంఆయన దివ్యదేహంలో నాభివరకు బ్రహ్మతత్త్వం,అక్కడి నుండి గళం వరకు విష్ణుతత్త్వం,అక్కడి నుండి శీర్షం వరకు రుద్ర ఈశాన శివతత్వం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అదే నరసిమ్హావతారం. ఆ స్వామి అభయస్వరూపుడు. దుష్టశిక్షణకొరకై అవతరించిన కరుణమూర్తి !
Please send the following storam::
దయ చేసి ఈ క్రింది స్తోత్రం పంపగలరు