ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
- వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
- నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
- విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
- ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
- శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
- రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
- లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
- అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
- మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
- సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
- దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
- ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
- భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
- సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
- శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
- సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
- చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
- యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
- బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
- వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
- నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
- హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
- హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
- తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
- గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
గాయత్రి జపము వలన కలుగు ప్రయోజనాలు
గాయత్రీ మంత్రం చాలా గొప్పది. దాని ప్రభావం అనంతం. పూర్వం ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని హోమాలు చేసి రోగాల్ని పోగొట్టుకున్నారని దేవీ భాగవతం వివరిస్తోంది. ఈ మంత్ర, జప, హోమ విధానాల్ని బాగా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. మంత్రం ఇంత శక్తిమంతమైనది కనుకనే ఈనాటికీ చాలా చోట్ల దీని మహత్వం ప్రచారంలో వినిపిస్తోంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం వల్ల చేకూరే ప్రయోజనాల్ని దేవీ భాగవతం పదకొండో స్కంధంలో వివరించి చెప్పాడు.
రావిచెట్టు కింద శనివారం కూర్చొని నూరుసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే భూత రోగ అభిచారాల నుంచి విముక్తి లభిస్తుంది. తిప్పతీగ ముక్కలు పాలలో నానపెట్టి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయహోమం అవుతుంది. ఇలా చేయటం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటం కోసం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానపెట్టి అగ్నిలో వ్రేల్చితే (హోమం చేస్తే) క్షయరోగం తగ్గుతుంది.
పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటినీ కలిపి గాయత్రీ మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. క్షీరాన్నాన్ని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇచ్చి, సూర్యుడికి నివేదించి దాన్ని రాజయక్ష్మ రోగికి తినిపిస్తే బాధ తగ్గుతుంది. సోమలతను కణుపుల వరకూ తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. శంఖవృక్షపు పూలను గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వ్రేల్చితే కుష్టురోగం తొలగుతుంది. పాలచెట్టు సమిధలతో హోమం చేస్తే ఉన్మాదం తగ్గుతుంది. మేడిచెట్టు సమిధలను గాయత్రీ మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరకురసం, తేనె కలిపి హోమం చేసినా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మసూచి రోగం మటుమాయమవుతుంది.
కపిలగోవు నెయ్యిని వ్రేల్చినా మసూచి తొలగిపోతుంది. మేడి, మర్రి, రావి సమిధలను వ్రేల్చితే ఆవులు, గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిధలను పాలు, నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రీ మంత్రంతో హవనం చేస్తే చీమలు తదితరాల వల్ల కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టిపెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్నిభయం, గాలిభయం, దొంగలభయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూతరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రీ మంత్ర జలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూత శాంతికి నూరుసార్లు గాయత్రీ మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
గాయత్రీ మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి, కలివి కలుగుతాయి. ఎర్ర కమలాలను గాయత్రీ మంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. అన్నాన్ని హోమం చేసినా సంపదలు కలుగుతాయి. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడు వేళ్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తులతూగుతుంటాయి. మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు రెండు వందల సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రీ మంత్ర హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రీ మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. ఈ జపం ఎలా ఎన్నిసార్లు ఏయే నియమ నిష్టలతో చేయాలనే విషయాన్ని పండితుల నుంచి తెలుసుకొని అలా చేయటం ఉత్తమం.
శతగాయత్రి-మంత్రావళి
-: బ్రహ్మ గాయత్రి :-
- వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
- తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
- సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //
-: విష్ణు గాయత్రి :-
- నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
- లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
- దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
-: శివ గాయత్రి :-
- శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
- తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
- సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
- పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
- గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
- తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
-: వృషభ గాయత్రి :-
- తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
- తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
-: చండీశ్వర గాయత్రి :- - ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
- చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
-: భృంగేశ్వర గాయత్రి :-
- భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
-: వీరభద్ర గాయత్రి :- - కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
- చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
- ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
-: శిఖరగాయత్రి :-
- శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
-: ధ్వజగాయత్రి :- - ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//
-: దత్త గాయత్రి :-
- దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//
-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//
-: సుదర్శన గాయత్రి :-
- సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
- సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
-: మత్స్య గాయత్రి :-
- జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//
-: కూర్మ గాయత్రి :-
- కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//
-: వాస్తుపురుష గాయత్రి :-
- వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//
-: శ్రీ గణపతి గాయత్రి :-
- తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
- ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
-: శ్రీ కృష్ణ గాయత్రి :-
- దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
- గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
- వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
-: శ్రీ రామ గాయత్రి :-
- దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
- ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
- ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
- పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
- వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//
-: శ్రీ స్కంద గాయత్రి :-
- తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
- తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
- షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
- భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
- కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
-: శ్రీ గరుడ గాయత్రి :-
- తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//
-: శ్రీ అనంత గాయత్రి :-
- అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//
-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
- దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
- వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
- కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
- ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
- జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
- ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
- శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
- శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
- భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
- అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
- అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
- చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
- సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
- భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
- రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
- శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
- తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//
-: శ్రీ సాయినాథ గాయత్రి :-
- జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//
-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
- శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//
-: శ్రీ నృసింహ గాయత్రి :-
- వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
- రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//
-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
- క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//
-: యంత్ర గాయత్రి :-
- యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//
-: మంత్ర గాయత్రి :-
- మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
- వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
- మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
- అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
-: శ్రీ గౌరి గాయత్రి :-
- గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
- మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
-: శ్యామలా గాయత్రి :-
- శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
- మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//
-: భైరవ గాయత్రి :-
- త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//
-: శక్తి గాయత్రి :-
- త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
- బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
- త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
-: శ్రీ బాలా గాయత్రి :-
- త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//
-: శ్రీ సీతా గాయత్రి :-
- మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//
-: శ్రీ దుర్గా గాయత్రి :-
- కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//
-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
- జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//
-: శ్రీ ధరా గాయత్రి :-
- ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//
-: శ్రీ హంస గాయత్రి :-
- హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//
-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
- త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
- త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
- రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
-: శ్రీ యమునా గాయత్రి :-
- యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//
-: శ్రీ వారాహీ గాయత్రి :-
- వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
- చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//
శ్రీ వైష్ణవీ గాయత్రి :-
- చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
శ్రీ నారసింహ గాయత్రి :-
- కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//
శ్రీ బగాళా గాయత్రి :-
- మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
- సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//
శ్రీ సంతోషీ గాయత్రి :-
- రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//
శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
- తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
- దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
గాయత్త్రీ కవచమ్
నారదఉవాచ:
స్వామిన్ సర్వజగన్నాధ సంశయో2స్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర
ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం
భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః
కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్
ఋషి శ్ఛందో2ధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో
నారాయణ ఉవాచ :
అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే
సర్వా న్కామా నవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః
ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా
తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనమ్
చతుర్భిర్హృదయం ప్రోక్తమ్ త్రిభి ర్వర్ణై శ్శిర
స్స్మృతమ్
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం
స్స్ముతమ్
చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్
తదస్ర్తకమ్
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్
ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై
స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ
వర్ణాత్మికామ్
గాయత్త్రీ వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం
గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం
హస్తైర్వహంతీం భజే
గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ
పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ
పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ
తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదమ్
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ
దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకమ్
నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే
ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకమ్
చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా
ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకమ్
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా
దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకమ్
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకమ్
మకారో హృదయం రక్షే ద్ధి ( త్ + హి ) కార ఉదరే తథా
ధికారో నాభి దెశేతు యోకారస్తు కటిం తథా
గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః
పదాక్షరమ్
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకమ్
దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకమ్
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు
ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనమ్
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకమ్
పదాక్షరమ్ ర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్
శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచమ్
సంపూర్ణం.
ఇది చాలా శక్తి వంతమైనది. రోజూ ఉదయం
పారాయణ చేస్తే సాక్షాత్తు గాయత్త్రీ మాత మనకు
తోడుగా ఉండి రక్షస్తుంది. గాయత్త్రీ జప
ప్రారంభంలో హృదయమును,
అంత్యమునందు కవచమును పారాయణ చేయు
సాంప్రదాయము కలదు.
సర్వే జనాః స్సుఖినోభవంతు.
గాయత్రీ మంత్రాన్ని మించిన జపం లేదు…
“ఓం భూర్భువస్సువః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్”
దీ గాయత్రీ మంత్రం. మన పూజలు, మంత్రాల్లో ఈ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. “న గాయత్ర్యాః పరం, మంత్రం నమాతుః పరదైవతం” అన్నారు పెద్దలు. అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనేది దీని భావం. ఆది శంకరాచార్యుడు “గాయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అన్నాడు. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్ధం.
చాలామంది గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరిస్తుంటారు. ఉచ్చరించ లేనివారు సీడీ పెట్టుకుని వింటారు. కానీ దీనికి అర్ధం ఎందరికి తెలుసు? కబీర్ దాస్ చెప్పినట్టు ‘చేతిలో జపమాల, నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే’, గాయత్రీ మంత్రానికి అర్ధం, పరమార్ధం తెలీనప్పుడు లక్షసార్లు విన్నా, స్మరించినా ప్రయోజనమే లేదు. అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్రంలో ప్రతి అక్షరానికీ అర్ధం ఉంది. స్థూలంగా – “లోకంలో సమస్తాన్నీ సృష్టించే, సర్వ విశిష్ట గుణాలతో, ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుని, శ్రేష్టుని, జ్ఞాన ప్రకాశములు కలవానిని, పూర్తి రూపం ఉన్నవానిని ధ్యానిస్తాను” అని గాయత్రీ మంత్రానికి అర్ధం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – “ప్రణవ స్వరూపుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, అంతటా నిండి ఉన్నవాడు, సర్వేంద్రియములను ప్రకాశింపచేసేవాడు, సృష్టి, స్థితి, లయ, కారణభూతుడు, సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వ సుఖాలను ఇచ్చే, స్వయం ప్రకాశకుడైన పరమాత్మునికి నా నమస్కారాలు” అని అర్ధం.
క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే, “అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తీ, మా బుద్ధులను ప్రక్షాళన చేసి, మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు” అని గాయత్రీ మంత్ర అర్ధం. ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, ఇంకొందరు ఆది పరాశక్తిగా ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార, నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు.
రోజుకు వేయిసార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలూ హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు.
ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్ర జపం చేయాలనుకునేవారు మొదట మూడుసార్లు ప్రాణాయామం ఆచరించి, ఆపైన గాయత్రీ జపం చేయాలి. జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్ధించాలి. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా స్మరించాలి. ప్రాతః కాల వేళ తూరుపు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యేవరకు ప్రార్ధించాలి. సాయంకాలం పడమటి దిశగా కూర్చుని, నక్షత్రాలు కనిపించేవరకూ ప్రార్ధించాలి. ఈ మంత్రాన్ని పైకి వినిపించకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోవాలి.
గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే, ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారు