గాయత్రి అంటే…


ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

  1. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
  2. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
  3. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
  4. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
  5. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
  6. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
  7. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
  8. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
  9. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
  10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
  11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
  12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
  13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
  14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
  15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
  16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
  17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
  18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
  19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
  20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
  21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
  22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
  23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
  24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

  • గాయత్రి మంత్రాక్షరాలు

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.


గాయత్రి జపము వలన కలుగు ప్రయోజనాలు

గాయత్రీ మంత్రం చాలా గొప్పది. దాని ప్రభావం అనంతం. పూర్వం ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని హోమాలు చేసి రోగాల్ని పోగొట్టుకున్నారని దేవీ భాగవతం వివరిస్తోంది. ఈ మంత్ర, జప, హోమ విధానాల్ని బాగా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. మంత్రం ఇంత శక్తిమంతమైనది కనుకనే ఈనాటికీ చాలా చోట్ల దీని మహత్వం ప్రచారంలో వినిపిస్తోంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం వల్ల చేకూరే ప్రయోజనాల్ని దేవీ భాగవతం పదకొండో స్కంధంలో వివరించి చెప్పాడు.

రావిచెట్టు కింద శనివారం కూర్చొని నూరుసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే భూత రోగ అభిచారాల నుంచి విముక్తి లభిస్తుంది. తిప్పతీగ ముక్కలు పాలలో నానపెట్టి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయహోమం అవుతుంది. ఇలా చేయటం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటం కోసం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానపెట్టి అగ్నిలో వ్రేల్చితే (హోమం చేస్తే) క్షయరోగం తగ్గుతుంది.

పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటినీ కలిపి గాయత్రీ మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. క్షీరాన్నాన్ని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇచ్చి, సూర్యుడికి నివేదించి దాన్ని రాజయక్ష్మ రోగికి తినిపిస్తే బాధ తగ్గుతుంది. సోమలతను కణుపుల వరకూ తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. శంఖవృక్షపు పూలను గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వ్రేల్చితే కుష్టురోగం తొలగుతుంది. పాలచెట్టు సమిధలతో హోమం చేస్తే ఉన్మాదం తగ్గుతుంది. మేడిచెట్టు సమిధలను గాయత్రీ మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరకురసం, తేనె కలిపి హోమం చేసినా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మసూచి రోగం మటుమాయమవుతుంది.

కపిలగోవు నెయ్యిని వ్రేల్చినా మసూచి తొలగిపోతుంది. మేడి, మర్రి, రావి సమిధలను వ్రేల్చితే ఆవులు, గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిధలను పాలు, నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రీ మంత్రంతో హవనం చేస్తే చీమలు తదితరాల వల్ల కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టిపెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్నిభయం, గాలిభయం, దొంగలభయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూతరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రీ మంత్ర జలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూత శాంతికి నూరుసార్లు గాయత్రీ మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.

గాయత్రీ మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి, కలివి కలుగుతాయి. ఎర్ర కమలాలను గాయత్రీ మంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. అన్నాన్ని హోమం చేసినా సంపదలు కలుగుతాయి. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడు వేళ్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తులతూగుతుంటాయి. మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు రెండు వందల సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రీ మంత్ర హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రీ మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. ఈ జపం ఎలా ఎన్నిసార్లు ఏయే నియమ నిష్టలతో చేయాలనే విషయాన్ని పండితుల నుంచి తెలుసుకొని అలా చేయటం ఉత్తమం.


శతగాయత్రి-మంత్రావళి

-: బ్రహ్మ గాయత్రి :-

  1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
  2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
  3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

-: విష్ణు గాయత్రి :-

  1. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
  2. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
  3. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

-: శివ గాయత్రి :-

  1. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
  2. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
  3. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
  4. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
  5. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
  6. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

-: వృషభ గాయత్రి :-

  1. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
  2. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
    -: చండీశ్వర గాయత్రి :-
  3. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
  4. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

-: భృంగేశ్వర గాయత్రి :-

  1. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
    -: వీరభద్ర గాయత్రి :-
  2. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
  3. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
  4. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

-: శిఖరగాయత్రి :-

  1. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
    -: ధ్వజగాయత్రి :-
  2. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

-: దత్త గాయత్రి :-

  1. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//
    -: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
    24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

-: సుదర్శన గాయత్రి :-

  1. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
  2. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

-: మత్స్య గాయత్రి :-

  1. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

-: కూర్మ గాయత్రి :-

  1. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

-: వాస్తుపురుష గాయత్రి :-

  1. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//

-: శ్రీ గణపతి గాయత్రి :-

  1. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
  2. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

-: శ్రీ కృష్ణ గాయత్రి :-

  1. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
  2. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
  3. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

-: శ్రీ రామ గాయత్రి :-

  1. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
  2. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-

  1. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
  2. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-

  1. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//

-: శ్రీ స్కంద గాయత్రి :-

  1. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
  2. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
  3. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-

  1. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
  2. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

-: శ్రీ గరుడ గాయత్రి :-

  1. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

-: శ్రీ అనంత గాయత్రి :-

  1. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-

  1. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
  2. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
  3. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
  4. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
  5. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
  6. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
  7. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
  8. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-

  1. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
  2. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
  3. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
  4. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
  5. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
  6. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
  7. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
  8. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
  9. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

-: శ్రీ సాయినాథ గాయత్రి :-

  1. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-

  1. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

-: శ్రీ నృసింహ గాయత్రి :-

  1. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-

  1. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-

  1. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

-: యంత్ర గాయత్రి :-

  1. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

-: మంత్ర గాయత్రి :-

  1. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-

  1. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-

  1. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
  2. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

-: శ్రీ గౌరి గాయత్రి :-

  1. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
  2. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

-: శ్యామలా గాయత్రి :-

  1. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
  2. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

-: భైరవ గాయత్రి :-

  1. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

-: శక్తి గాయత్రి :-

  1. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-

  1. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
  2. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

-: శ్రీ బాలా గాయత్రి :-

  1. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

-: శ్రీ సీతా గాయత్రి :-

  1. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

-: శ్రీ దుర్గా గాయత్రి :-

  1. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-

  1. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//

-: శ్రీ ధరా గాయత్రి :-

  1. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

-: శ్రీ హంస గాయత్రి :-

  1. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//

-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-

  1. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-

  1. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
  2. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

-: శ్రీ యమునా గాయత్రి :-

  1. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//

-: శ్రీ వారాహీ గాయత్రి :-

  1. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
  2. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//

శ్రీ వైష్ణవీ గాయత్రి :-

  1. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ నారసింహ గాయత్రి :-

  1. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//

శ్రీ బగాళా గాయత్రి :-

  1. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-

  1. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//

శ్రీ సంతోషీ గాయత్రి :-

  1. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-

  1. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
  2. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

గాయత్త్రీ కవచమ్
నారదఉవాచ:
స్వామిన్ సర్వజగన్నాధ సంశయో2స్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర
ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం
భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః
కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్
ఋషి శ్ఛందో2ధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో
నారాయణ ఉవాచ :
అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే
సర్వా న్కామా నవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః
ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా
తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనమ్
చతుర్భిర్హృదయం ప్రోక్తమ్ త్రిభి ర్వర్ణై శ్శిర
స్స్మృతమ్
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం
స్స్ముతమ్
చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్
తదస్ర్తకమ్
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్
ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై
స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ
వర్ణాత్మికామ్
గాయత్త్రీ వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం
గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం
హస్తైర్వహంతీం భజే
గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ
పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ
పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ
తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదమ్
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ
దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకమ్
నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే
ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకమ్
చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా
ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకమ్
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా
దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకమ్
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకమ్
మకారో హృదయం రక్షే ద్ధి ( త్ + హి ) కార ఉదరే తథా
ధికారో నాభి దెశేతు యోకారస్తు కటిం తథా
గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః
పదాక్షరమ్
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకమ్
దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకమ్
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు
ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనమ్
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకమ్
పదాక్షరమ్ ర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్
శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచమ్
సంపూర్ణం.

ఇది చాలా శక్తి వంతమైనది. రోజూ ఉదయం
పారాయణ చేస్తే సాక్షాత్తు గాయత్త్రీ మాత మనకు
తోడుగా ఉండి రక్షస్తుంది. గాయత్త్రీ జప
ప్రారంభంలో హృదయమును,
అంత్యమునందు కవచమును పారాయణ చేయు
సాంప్రదాయము కలదు.

సర్వే జనాః స్సుఖినోభవంతు.


గాయత్రీ మంత్రాన్ని మించిన జపం లేదు…

“ఓం భూర్భువస్సువః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్”

దీ గాయత్రీ మంత్రం. మన పూజలు, మంత్రాల్లో ఈ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. “న గాయత్ర్యాః పరం, మంత్రం నమాతుః పరదైవతం” అన్నారు పెద్దలు. అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనేది దీని భావం. ఆది శంకరాచార్యుడు “గాయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అన్నాడు. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్ధం.

చాలామంది గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరిస్తుంటారు. ఉచ్చరించ లేనివారు సీడీ పెట్టుకుని వింటారు. కానీ దీనికి అర్ధం ఎందరికి తెలుసు? కబీర్ దాస్ చెప్పినట్టు ‘చేతిలో జపమాల, నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే’, గాయత్రీ మంత్రానికి అర్ధం, పరమార్ధం తెలీనప్పుడు లక్షసార్లు విన్నా, స్మరించినా ప్రయోజనమే లేదు. అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

గాయత్రీ మంత్రంలో ప్రతి అక్షరానికీ అర్ధం ఉంది. స్థూలంగా – “లోకంలో సమస్తాన్నీ సృష్టించే, సర్వ విశిష్ట గుణాలతో, ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుని, శ్రేష్టుని, జ్ఞాన ప్రకాశములు కలవానిని, పూర్తి రూపం ఉన్నవానిని ధ్యానిస్తాను” అని గాయత్రీ మంత్రానికి అర్ధం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – “ప్రణవ స్వరూపుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, అంతటా నిండి ఉన్నవాడు, సర్వేంద్రియములను ప్రకాశింపచేసేవాడు, సృష్టి, స్థితి, లయ, కారణభూతుడు, సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వ సుఖాలను ఇచ్చే, స్వయం ప్రకాశకుడైన పరమాత్మునికి నా నమస్కారాలు” అని అర్ధం.

క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే, “అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తీ, మా బుద్ధులను ప్రక్షాళన చేసి, మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు” అని గాయత్రీ మంత్ర అర్ధం. ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, ఇంకొందరు ఆది పరాశక్తిగా ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార, నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు.

రోజుకు వేయిసార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలూ హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు.

ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.

గాయత్రీ మంత్ర జపం చేయాలనుకునేవారు మొదట మూడుసార్లు ప్రాణాయామం ఆచరించి, ఆపైన గాయత్రీ జపం చేయాలి. జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్ధించాలి. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా స్మరించాలి. ప్రాతః కాల వేళ తూరుపు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యేవరకు ప్రార్ధించాలి. సాయంకాలం పడమటి దిశగా కూర్చుని, నక్షత్రాలు కనిపించేవరకూ ప్రార్ధించాలి. ఈ మంత్రాన్ని పైకి వినిపించకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోవాలి.

గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే, ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారు

గాయత్రి

ఈ రోజు నుండి శ్రీరామనవమి వరకు అనగా ఈ వసంత నవరాత్రుల లో సుందరాకాండ చదువుకుందాం……..


ఈ రోజు నుండి శ్రీరామనవమి వరకు అనగా ఈ వసంత నవరాత్రుల లో సుందరాకాండ చదువుకుందాం……..

🌿🌼🙏#సుందరకాండ – 1🙏🌼🌿#వసంత #నవరాత్రులలో #సుందరకాండ #పారాయణ🙏🌼🌿

🏹🚩సుందరకాండ -1🚩🏹

సుందరే సుందరో రామ:
సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?

🏹🚩పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు

🚩రాముడు సుందరాతి సుందరుడు 🏹
సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది?

🚩సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటే పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.

🚩తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్శన:|
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

🚩రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు
( భూమికి దగ్గరగా ఉండి, సర్వకాలము లయందు శుభ వార్తలను చెప్పే దేవతా స్వరూపులు ) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప వృషభం నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు.

🚩ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.

🚩హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండి పోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి.

🚩అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్య పోయారు.

🚩ఏష పరత సంకాశో హనుమాన్ మారుతాత్మజః,
తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయమ్

🚩అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ” ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ” అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.

🚩అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి ” రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతే అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను ” అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.

🚩హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి ” ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడ, సముద్రాన్ని తాగుతున్నాడా? ” అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు.

🚩ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.

🚩హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి ” సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం అని అనుకొన
తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి ” నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా ? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు ” అన్నాడు.

🚩అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి.

🚩బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు ” ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు ” అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.

🚩అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి ” అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి.
ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు.

🚩ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ‘ పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ‘ అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో ” అన్నాడు.

అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని ” నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి.
నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు ” అని చెప్పి వెళ్ళిపోయాడు.

🚩బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి ” ఓహో! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా ” అన్నాడు.

🚩అప్పుడు మైనాకుడు ” ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను ” అనుకున్నాడు.

🚩అప్పుడు ఇంద్రుడు అన్నాడు ” నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను ” అని అభయ మిచ్చాడు.

🚩అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) ” చూశావ తల్లీ, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని బయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి ” అన్నారు.

🚩అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో ” నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నూట్లోకి దూరు ” అనింది.

🚩అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి ” నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను ” అన్నాడు.

🚩అప్పుడా సురస ” అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించ వలసిందే ” అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు.

🚩సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి ” అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను ” అన్నాడు.

🚩ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక ” అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.

🚩అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మోదలుపెట్టింది.

🚩తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.

🚩అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.
🚩🔥🚩🔥🚩🔥🚩🔥🚩

దురదృష్టాన్ని తొలగించే ధూమావతి ఉపాసన


🙏దురదృష్టాన్ని తొలగించే ధూమావతి ఉపాసన 🙏

ఎన్నో రకాల చెడు కర్మలకు గొప్ప పరిహార సాధన ,ఈ తల్లిని అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది, గ్రహ దోషాలను తొలగిస్తుంది, కవిత్వం సిద్ధిస్తుంది, ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి ఆప్పులలో కూరుకుపోయి దిక్కుతోచని దౌర్భాగ్య స్థితినుండి రక్షిస్తుంది, ఉపాసకుడి యొక్క దురదృష్టాన్ని ఆమె చేతిలో ని చేట చీపురతో ఊడ్చుకొని పోతుంది ఈమె సాధన సిద్దించి ఈ తల్లి అనుగ్రహిస్తే వారి జీవితంలో లోటు ఉండదు..

👉ఏమని కోరుకొని సంకల్పించాలి:
ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి ఈమెను ఏది కావాలి అని అడగకూడదు డబ్బు కావాలి ఉద్యోగం కావాలి ఇలా ఏది కూడా అడగకూడదు.. నా సమస్యలు పోవాలి నా బాధలు తొలగిపోవాలి నా అప్పుల బాధలు కోర్ట్ సమస్యలు పోవాలి… మానసిక ఆందోళన తొలగి పోవాలి.. వివాహ దోషం పోవాలి, గర్భ దోషం పోవాలి ,ఇలా ఏదైతే మీకు బాధ కలిగిస్తోంది అది మీకు దూరమైపోవాలి అని కోరుకుంటే నే ఈమె కరునిస్తుంది ఈ సాధన ఫలిస్తుంది.

👉ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి.

ఈ ఉపాసన ఎప్పుడు రాత్రి సమయంలోనే చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది, రాత్రి 11 గం మొదలు పెట్టాలి ఈ మంత్రాన్ని 21 సార్లు గాని 51 సార్లు కానీ 108 సార్లు ఇలా ఎదో ఒక సంఖ్య ని నిర్ణయించుకుని ఒకే సమయంలో రోజూ మొదలు పెట్టాలి..

ఈ జపం రెండు విధాలుగా సాధన చేస్తారు మొదటి పద్దతి రోజు ఇన్నిసార్లు అని నియమించుకుని పదివేలు జపం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుందిసమస్యలు తగ్గిపోతుంది. తర్వాత ఏ సమస్య రాకుండా మనసులో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు.

ఇంక రెండో పద్దతి ఈ మంత్రాన్ని రోజూ రాత్రి 11 గం 108 సార్లు జపం చేస్తూ 41 రోజులు చేస్తారు ఇలా చేసిన మీ సమస్య తీరిపోతుంది.

ఫోటో ఉండాల్సిన పని లేదు నివేదన పెట్టి చేయాలని నియమం లేదు శుభ్రంగా ఉన్న ఎక్కడైనా కూర్చుని ఈ శ్లోకం జపించవచ్చు అయితే భక్తిగా చేయాలి…
ఈ సాధన చేస్తున్న వారు రోజు ఉదయం మీ మనసులో సమస్య తలుచుకుని కాకులకు అన్నం పెడితే మంచిది. మీ జపం 41 రోజులు పూర్తి అయినా, లేక పది వేల జపం పూర్తి అయిన తర్వాత పెద్దవయసు ఉన్న భర్త లేని వృద్ధురాలు పేద వారు అయిన ఒక స్త్రీ ని ఆ తల్లిగా భావించి చీర పండ్లు దక్షణ, ఇవ్వాలి.. మీకు ఉన్న అన్ని సమస్యలో ఒక్కోటి జపం చూస్తుండగానే తీరుతూ వస్తుంది.. మొండిగా ఉన్న పిల్లల కోసం. కూడా తల్లితండ్రులు రాత్రి ఈ శ్లోకమ్ 21 మారు చదివి ఉదయం పిల్లలో ఉన్న మొండితనం కోపం తీసుకుని పో అని చెప్పి కాకికి అన్నం పెడుతూ ఉంటే పిల్లలోను మంచి మార్పు వస్తుంది.

ఈ సాధన చేస్తున్న వారికి ఎన్నో నిదర్శనలు తెలుస్తూ ఉంటుంది దానికి బయపడకూడదు కలలో విచిత్ర ఆకారంలో కనిపిస్తారు.. జపం చేసే ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసన వస్తుంది ఒక్కోసారి, అప్పుడు జపం అపకూడదు కలలో ఎవరో చావగొట్టినట్టు కనిపిస్తుంది.. మీరు ఆ తల్లికి ఒక్కటే సంకల్పంగా చెప్పుకోవాలి నా సమస్యలు తీసుకొనిపో నా దుక్కాన్ని తీసుకుని పో అని అదే కోరుకోవాలి.. అవన్నీ పోతే మీకు సంతోషం వస్తుంది..
విధవరాలు రూపంలో ఉన్న ఈ తల్లి కూడా పార్వతీ స్వరూపం ఈమె చూడటానికి ఇలా ఉన్నా సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంది..ఈమెను ఉపాసించే ఆడవాళ్లకు వైధవ్యం కలగదు అనారోగ్యంతో ఉన్న భర్త జబ్బుని తీసుకుని పో అని ఈమె కు జపం చేయాలి. అలాగే ఈ సాధన స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవచ్చు.. ఇందులో బీజ మంత్రాలు మూల మంత్రాలు లేవు కనుక ఉపదేశంతో అవసరం లేదు. స్త్రీలు ఆటంకం సమయంలో ఆపి తర్వాత కొనసాగించాలి.

🕉️సౌభాగ్యదాత్రీ ధూమావతీ కవచమ్ 🕉️

ధూమావతీ ముఖం పాతు ధూం ధూం స్వాహాస్వరూపిణీ |
లలాటే విజయా పాతు మాలినీ నిత్యసున్దరీ ||

కళ్యాణీ హృదయం పాతు హసరీం నాభి దేశకే |
సర్వాంగం పాతు దేవేశీ నిష్కలా భగమాలినీ ||

సుపుణ్యం కవచం దివ్యం యః పఠేద్భక్తి సంయుతః |
సౌభాగ్యమతులం ప్రాప్య జాతే దేవీపురం యయౌ ||

|| శ్రీ సౌభాగ్య ధూమావతీకల్పోక్త ధూమావతీ కవచమ్ ||

(ఈ కవచం రోజూ రాత్రి 11 గం సమయంలో మొదలు చేయాలి, ఆహార నియమాలు లేదు, వివహితులకు బ్రహ్మచర్య నియమాలు లేదు, ఉదయం స్నానం చేసి ఉంటే చాలు జాపనికి కాళ్ళ చేతులు మొహం కడిగి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో చేస్తే చాలు, ఇంట్లో ఎవరైనా మైలు ఉంటే మీరు దూరంగా ఉంటే చాలు జపం కొనసాగించ వచ్చు. 10,000 జపం పూర్తి చేస్తే మంత్రం సిద్ధిస్తుంది అయితే 10,000 జపము పూర్తి చేయడానికి సమవస్తారాలు టైం తీసుకొకూడదు.. అంత చేయలేరు అనుకుంటే 108 సార్లు చొప్పున 41 రోజులు చేయాలి మీ సమస్యలు తొలగాలి అంటే అన్నిసార్లు చేయాల్సిందే, జపము పూర్తి అయ్యాక రోజు ఒకసారి మనసులో తలుచుకుని నమస్కారం చేసుకుంటే చాలు.)

ఇక్కడ ఇచ్చిన చిత్రం కామాఖ్య ఆలయంలో ని ధూమావతి మూల విగ్రహం.

🌷శ్రీ మాత్రే నమః🌷

సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు?


సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ… తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!

దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు.

వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.

శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.

ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు.

కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.

శూరపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది.

అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుంది?


దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీ దేవిగా జన్మిస్తుంది.పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది

పరమ శివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు.ఆ విషయం తెలుసుకొని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది.

దాంతో శివుడు చలించకోపవడంతో మన్మథుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు.దానితో ఈశ్వరుడు ఆగ్రుడవుతాడు.

మూడో కన్నుతో మన్మథుడిని భస్మం చేస్తాడు.ఆ తర్వాత ఆ భోళా శంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు.

పార్వతికి ఏం చేయాలో తెలియదు.అప్పుడు నారద మహర్షి పార్వతీ దేవితో కొన్ని విషయాలు చెబుతాడు.

తల్లీ పరమ శివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు.కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్లి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు.

భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు.నారద మహర్షి చెప్పినట్టు పార్వతీ దేవి అన్నదానం చేస్తూ.

అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింప పడుతున్న సమయంలో మహా శివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు.

పార్వతీ దేవి భర్తను గుర్తు పట్టి చేయి పట్టుకుంటుంది.

దానితో భోళా శంకరుడికి సర్వమూ అర్థమై పార్వతీ దేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు.అప్పటి నుంచి పార్వతీ దేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహా శివుడు వెలిశాడు.

ఇలా అన్నపూర్ణ దేవి ఆ భోళా శంకరుడికి భిక్షం వేసింది.

🚩సర్వేజనా సుఖినోభవంతు🚩

దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర


పతివ్రత అయిన సతీసుమతి ఒక మహర్షి శాపం వల్ల ఆ మరునాటి సూర్యోదయాన తన భర్త అయిన కౌశికుడు చనిపోతాడని, తన పాతివ్రత్య మహిమతో సూర్యోదయాన్ని ఆపేసింది. సూర్యుడు ఉదయించక పోయేప్పటికి లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. అప్పుడు అత్రి మహర్షి భార్య సతీ అనసూయాదేవి సుమతిని ఒప్పించి, సూర్యుని ఉదయింపజేసి, మరణించిన కౌశికుని తన పాతివ్రత్య మహిమతో బ్రతికించింది. సూర్యుడు ఉదయించేలా చేసి, లోకాలను రక్షించినందుకు దేవతలు, త్రిమూర్తులు ఆమె వద్దకు వచ్చి, ఏం కావాలో కోరుకోమన్నారు. అంతకు ముందే చాలా కాలం అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులను సంతానంగా పొందగోరి చాలా కాలం తపస్సు చేశారు. ఇప్పుడు త్రిమూర్తులు వరమిస్తామనగానే, త్రిమూర్తులు తమకు బిడ్డలుగా పుట్టాలని కోరారు. త్రిమూర్తులు వారి అంశలను ఆమెలో ప్రవేశపెట్టారు. బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు పుట్టాడు. ఈశ్వరుని అంశతో దుర్వాస మహర్షి జన్మించాడు, శ్రీ మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు జన్మించేటప్పుడు బ్రహ్మ దేవుని నుంచి ఒక కళను, పరమశివుని నుంచి ఒక కళను తీసుకుని, తన కళ మూడవదిగా, త్రిమూర్తుల కళలతో, మూడు శిరస్సులతో, ఆరు చేతులతో, డమరుకం, త్రిశూలం మొదలైన త్రిమూర్తుల ఆయుధాలను ధరించి, నుదుటిన విభూతి రేఖలతోను, విష్ణు నామంతోను ప్రకాశిస్తూ విచిత్రమైన బాలునిగా జన్మించాడు.

మరొక పురాణ కథనం ప్రకారం స్వర్గలోకంలో – ఆ కాలంలో భూలోకంలో ఉన్న నారీమణులందరిలోకి ఎవరు పరమ పతివ్రత ? అనే చర్చ వస్తే, సతీ అనసూయాదేవి పరమ పతివ్రత అని నిర్ధారించారు. అప్పుడు త్రిమూర్తులు తాము ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించి, నిరూపించాలని తలచి ముగ్గురు సన్యాసులలా రూపము ధరించి, అనసూయాదేవి ఆశ్రమానికి అతిథులుగా వచ్చారు. ఆమె గృహస్థ ధర్మం ప్రకారం వారిని పూజించి, భోజనం చెయ్యమని అడిగింది. వారు ఆమెతో “నీవు వివస్త్రగా పెడితే, స్వీకరిస్తాము” అన్నారు. ఆమె తన పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి, పాలు త్రాగించింది. అలా త్రిమూర్తులను పసిబిడ్డలుగా చేసి ఉయ్యాలలూపింది, త్రిమాతలను తమ కోడళ్ళుగా పొందింది.

శ్రీ దత్తాత్రేయుని రూపం అసామాన్యమైనది. అది త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించిన తత్త్వం. మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు.
అత్రి కుమారుడు కావడంతో ఆయనను ఆత్రేయుడంటారు.

దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి గొప్ప అవధూత, మహాజ్ఞాని, చిరంజీవి, యుగయుగాలకు ఆదర్శమూర్తిగా ఉంటూ లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. మానవ జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. శ్రీ దత్తాత్రేయుడు సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. మహర్షులందరూ తమకు బ్రహ్మ జ్ఞానం బోధించమని ఆయన వెంట పడ్డారు. గురువు వచ్చిన వారిని పరీక్షించి కానీ, అనుగ్రహించడు కదా! దత్తాత్రేయుడు వారిని పట్టించుకోకుండా అరణ్యంలోకి వెళ్ళి ఒక సరస్సులోకి ప్రవేశించి, వెయ్యి సంవత్సరాలు ఆ నీళ్ళల్లో ఉండిపోయాడు. ఆ మహర్షులు ఆయన నీటిలోంచి బైటికి వచ్చే దాకా అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన బైటికి రాగానే, ఇప్పుడైనా మా శ్రద్ధను గమనించావు కదా ! నీ శిష్యులుగా స్వీకరించు. కావాలంటే మమ్మల్ని ఇంకా పరీక్షించు అన్నారు. ఆయన ఒక పాము పుట్టలోకి ప్రవేశించి, కొంత కాలానికి చేతిలో మద్యపాత్ర పట్టుకుని తాగుతూ ఒక స్త్రీతో కలిసి బైటికొచ్చాడు. ఆ మహర్షులు అతనిని ఆ స్థితిలో చూసి, అసహ్యాంచుకుని, ఇటువంటి వాడు మనకు గురువేమిటని భావించి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా తమను పరీక్షించటానికేనని భావించి, ఆయన కాళ్ళ మీద పడి గురువుగారూ ! మమ్మల్ని పరీక్షించటం చాలు, అనుగ్రహించమని ప్రార్ధించిన వారిని బ్రహ్మ జ్ఞానముతో అనుగ్రహించాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి భార్య అనఘాదేవి అనీ, ఆమె సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి దేవి అనీ భక్తులు భావిస్తారు. పురాణాలలో మధుమతీ సమేత దత్తాత్రేయుని గురించి చెప్పారు. అంటే దత్తాత్రేయుని శక్తి “మధుమతి” అన్నమాట.

త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడం వలన, శ్రీ దత్తాత్రేయుని రూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తూ ఉంటుంది.

దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు తత్త్వోపదేశం చేస్తూ, ప్రకృతిలోని ప్రతి శక్తీ మనకు గురువులేనని బోధిస్తూ, భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని, అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలనీ, కొండచిలువలా భ్రాంతిలో పడకూడదనీ, స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, పట్టుదలను ఏనుగు నుంచి, చేపనుంచి త్యాగచింతనను నేర్చుకోవాలనీ, మానావమానాలకు సమస్పందనఅలవరచుకోవాలని బోధించారు. సాలెపురుగు నుంచి సృష్టి, స్థితి, లయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలన్నాడు. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలనీ, చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలనీ, ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలనీ, చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలని వివరిస్తూ 24 మంది గురువుల గురించి బోధించాడు. ఇవన్నీ అందరికీ గురువులని చెప్పి, వీరందరినీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు, జగద్గురువు దత్తాత్రేయ స్వామి!

శ్రీ దత్తాత్రేయ స్వామి సతీమదాలస యొక్క మూడవ కుమారుడైన అలర్కుడికి యోగవిద్య నేర్పించాడు, ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. కార్తవీర్యార్జునునికి కూడా ఆధ్యాత్మిక విద్యను బోధించాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పదహారు అవతారాలను గురించి ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్, నిత్యానంద సరస్వతీ, స్వామి సమర్థ మొదలైన వారిని శ్రీ దత్తావతారాలుగా దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా గురు చరిత్రగా పారాయణ చేస్తారు.

పద్ధెనిమిది పురాణములలోను శ్రీ దత్తాత్రేయుని ప్రసక్తి ఉన్నది. మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభములలో దత్తచరితము విస్తృతంగా ఉంది.

భక్తులు శ్రీ దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకుంటారు. దత్తాత్రేయ స్వామి ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతున్నది. ఉగ్రత్వము అజ్ఞానము మీదనే ! అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును కలిగించే జ్ఞానమూర్తి, గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆయనకు గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వ మానవాళికి సర్వదా ఆచరణీయం. 🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

నహుషుడు



స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించటం వలన ఆయనకు బ్రహ్మహత్యా దోషము పట్టుకుంది అందువల్ల తాను స్వర్గాది పత్యానికి అనర్హుడిని అని భావించి ఆచూకీ తెలియని సరస్సులో నారాయణ మంత్రం జపిస్తూ ఒక తామర తూడు లో దాక్కున్నాడు ఆ సమయంలో అష్టదిక్పాలకులు దేవతలు మునులతో సంప్రదించగా వారు చంద్ర వంశములో ప్రభ – ఆయువు లకు జన్మించిన నహుషుడు అర్హుడని నిర్ణయించారు.
ఋగ్వేదంలో నహుషుని గురించి తరచుగా ప్రస్తావించబడింది . నహుషుడు ప్రతిష్ఠానం నుండి పాలించాడు. రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు అతను పురూరవుని పౌత్రుడు ఈతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా యతి (ముని అయ్యారు) యయాతి(రాజు అయ్యాడు) సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నాడు. శ్రీమద్భాగవతము నందును, విష్ణు పురాణము నందు నహుషుని కొడుకులు యతి, యయాతి , సంయాతి, ఆయాతి, నియతి, కృతి అని ఆరుగురు చెప్పబడి ఉన్నారు దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో నహుషుడు ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలు వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది అందువల్ల నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిగా చేశారు ఆ విధంగా ఒక సాధారణ రాజైన నహుషునికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు.
ఇంద్రపదవి చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనికి అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే ‘ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.శచీదేవి విష్ణుమూర్తిని ఈ ఆపద నుంచి తప్పించమని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు నహుషుని తన వద్దకు సప్తర్షులు పల్లకి మోయగా రమ్మని సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు శచీదేవి నహుషుడిని తన వద్దకు సప్తర్షులు పల్లకి మోయగా అందులో రమ్మని చెపుతుంది. తప్పని సరి పరిస్తుతులలో సప్తర్షులు నహుషుని పల్లకి మోయటానికి అంగీకరిస్తారు నహుషుడు ఆ పల్లకిలో బయలుదేరుతాడు.
శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. ‘సర్ప! సర్ప!’ (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందర పెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేక పోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుని శపించాడు.చేసిన తప్పును తెలుసుకొని నహుషుడు క్షమించమని వేడుకొని శాపవిమోచన అడుగుతాడు అప్పుడు అగస్త్యుడు ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆ నాడే నీకు శాప విమోచన కలుగుతుంది అని చెపుతాడు. ఆనాటి నుండి నహుషుడు పెద్ద సర్పము రూపంలో దైత్య వనములో తిరుగుతున్నాడు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతము దాటి దైత్యవనములో ప్రవేశిస్తారు.భీముడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న సమయములో సర్పరూపంలో నున్న నహుషుడు భీముడిని తన తోకతో బంధిస్తాడు వాయు దేవుడి అంశంతో జన్మించిన భీముుడు అమిత బలశాలి భుజ బలం లో, గదా యుద్ధం లో భీముడికి ఎవరూ సాటిలేరంటే అతిశయోక్తి కాదు. జరాసంధుడిని మల్ల యుద్ధం లో ఓడించిన యోధుడు భీముడు. బకాసురుడు, హిడింబాసురుడు మొదలైన రాక్షసులను వధించిన వాడు. దానంలో కర్ణుడికి, బలము భీముడికి ఎవరూ సాటిలేరని చెబుతారు. అటువంటి భీముడు విచిత్రముగా ఓ కొండ చిలువ కు బందీ కావాల్సి వచ్చింది భీమునికి ఆ సాధారణ బలం ఉన్నప్పటికీ, నహుషుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు, అతను పడిపోయినప్పుడు అగస్త్యుడి నుండి ఒక వరం పొందాడు, అతనిని తీసుకున్న, అతనికంటే గొప్ప బలవంతులు వెంటనే తమ బలాన్ని కోల్పోతారు.
భీముడిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు బందీ అయిన భీముని చూసి ఆశ్చర్యపోతారు. నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజు కి ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ‘నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా’ అని ప్రతిపాదించాడు ధర్మరాజు.
తన ప్రశ్నలకు సరి అయిన జవాబు లిస్తే భీముడిని వదిలిపెడతామని సర్ప రూపంలో ఉన్న నహుషుడు చెపుతాడు నహుషుడు, ధర్మరాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశారు. అవి ‘బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతను ఏం తెలుసుకోవాలి?’ అని. దానికి ధర్మరాజు ‘సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము వంటి లక్షణాలు ఉన్న వాడే బ్రాహ్మణుడు, అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలనీ’ బదులిచ్చాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారెవరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు. భారతములో యక్ష ప్రశ్నల గురించి మనము విన్నాము ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబులిచ్చి తన సోదరులను విడిపించుకున్న విషయం మనకు తెలుసు కానీ భారతములో యక్షుడిని మించిన చిత్రమైన పాత్ర సర్పరూప ములోని నహుషుడు ఆ విధంగా నహుషుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముడిని విడిపించుకొని నహుషునికి ధర్మరాజు శాప విమోచనం కలుగజేస్తాడు నహుషుడు ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసే శాప విముక్తుడవుతాడు నహుషుని వృత్తాంతం అరణ్యపర్వం లో ఉంది.పౌరులను పాటించాల్సిన రాజుకి ఆ పాలనాధికారం తలకెక్కి కోరరాని కోరిక కోరిన,నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెబుతుంది.

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు


7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన “దత్తాత్రేయ స్వామి”
*1వ ప్రశ్న:* ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.

4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది “మాట ఇవ్వడం”
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.

7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

హర హర మహ దేవ శంభో శంకర
ఓం నమో భగవతే నారాయణాయ

పిప్పలాదుడు


పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!
జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు
మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-
నారదుడు- నువ్వు ఎవరు?
అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.
నారదుడు- నీ తండ్రి ఎవరు?
అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి! నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్తిక తో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?
నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.
పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?
నారదుడు- శనిదేవుని మహాదశ.

ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.
నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.

సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-

1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.

2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది. కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

దానికి బ్రహ్మాదేవుడు ‘తథాస్తు’ అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని
“శనిః చరతి య: శనైశ్చరః” అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.
శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.

🚩సర్వే జనా సుఖినోభవంతు.🚩

మందపల్లి శ్రీ మందేశ్వర దేవస్థానము మహత్మ్యము

పూర్వకాలము నందు మేరు పర్వతముతో స్పర్ధ వచ్చి.. అంతకంటే ఉన్నతముగా ఉండాలని భావించి.. వింధ్యాపర్వతము విపరీతముగా పెరగసాగెను. ఇలా వింధ్య పర్వతము మిక్కుటముగా పెరుగుతుండడంతో.. భారతవర్షమున ఉత్తర దక్షిణ భాగములయందు సూర్యకిరణ ప్రసారము చక్కగా ప్రసరించదని భయమేర్పిడింది. అప్పుడు దేవతలు, ఋషి పుంగవులు అగస్త్య భగవానుని వద్దకు వచ్చి.. వింధ్యపర్వతము పెరుగుదలను నిలపాలని ప్రార్థించారు. అప్పుడు ఆ లోపాముద్రాపతియగు అగస్త్య మహర్షి.. వేయి మంది మహర్షులతో, వివిధ పశు జాతులతో, బహు మృగ గణములతో వింధ్య పర్వతమునుచేరాడు.

అంతట ఆ పర్వతరాజు బహు ఋషిగణ సమేతుడగు అగస్త్య భగవానునికి సాష్టాంగ నమస్కారం చేసి.. ఆర్ఘ్యపాద్యాదులు నర్పించి అతిథి సత్కారాలతో సంతుష్టుని చేసెంది. అగస్త్యముని పుంగవుడు సంతుష్టాంతరంగుడై.. పర్వత శ్రేష్టుడా అంటూ వింధ్యుని ప్రశంసించి దేవ కార్యమును మనసు నందుంచుకొని ఇలా చెప్పాడు. హే! పర్వత శ్రేష్టుడా.. నేను మహా జ్ఞానులగు మహర్షులతో కలిసి దక్షిణ దిక్కునకు తీర్థయాత్రకై బయలుదేరాను. కాబట్టి నాకు మార్గమునిమ్ము. నేను తిరిగి ఉత్తర దిక్కునకు వచ్చే పర్యంతము నీవు పెరగకుండగా ఇలానే ఉండాలి. దీనికి భిన్నముగా చేయరాదని చెప్పగా ఆ పర్వత శ్రేష్టుడు సరేనని అలాగే ఉండిపోయాడు.

అగస్త్యమహర్షి.. ఋషులతో దక్షిణ దిక్కుకు వెళ్లిపోయాడు. అనంతరం క్రమముగా సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి.. సంవత్సరము సత్రయాగము చేయుటకు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులు మహా పాపులునగు అశ్వత్థుడు, పిప్పలుడు అను రాక్షసులు దేవలోకములో కూడా ప్రసిద్ధి చెందారు. వారిరువురిలో అశ్వత్థుడు రావిచెట్టు రూపములోనూ.. పిప్పలుడు బ్రాహ్మణరూపములో.. సమయం చూసుకుని.. యజ్ఞమును నాశన చేయాలని తలచారు. రావిచెట్టు రూపములోనున్న అశ్వత్థుడు.. ఆ వృక్షఛాయనాశ్రయించుటకు వచ్చిన బ్రాహ్మణులను తినేవాడు. పిప్పలుడు.. సామ వేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యగణంబులను భక్షించెవాడు.

రోజురోజుకి బ్రాహ్మణులు క్షీణిస్తున్నారని గమనించిన మహర్షులు.. గౌతమీ దక్షిణ తటమున నియత వ్రతుడై తపమును నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూసి ఈ ఘోరమగు రాక్షస కృత్యముల గురించి ఆయనకు నివేదించారు. ఈ రాక్షసులను వధించమని కోరారు. అప్పుడు శని ఋషులతో ఇలా చెప్పాడు. నేను ఇప్పుడు నియతవ్రతుడనై తపస్సు చేయుచున్నాను. నా తపస్సు పూర్తికాగానే రాక్షసుల నిరువురిని వధిస్తాను అని తెలిపాడు. అప్పుడు మహర్షులు మేము మా తపః ఫలితమును నీకిచ్చెదము. నీవు వెంటనే ఆ రాక్షసులను సంహరింపుమనిరి. అయితే రాక్షస సంహారము పూర్తి అయినట్లేనని శని.. ఋషులతో పలికి బ్రాహ్మణ వేషమును దాల్చి వృక్షరూపంలోనున్న అశ్వత్థుడు వద్దకు వెళ్లి ప్రదక్షిణములు చేశాడు. అశ్వత్థుడు.. ఈ శనిని మామూలు బ్రాహ్మణుడేనని తలచి అలవాటు చొప్పున మింగేశాడు.

అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి.. అతని పేగులను తెంచేశాడు. ఆ పాపాత్ముడగు రాక్షసుడు సూర్యపుత్రుడగు శనిచే క్షణమాత్రములో మహా వజ్రాహతు వలె భస్మీభూతుడాయెను. బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము నభ్యసించుటకు వచ్చిన బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా శని వెళ్లి.. అతనిని సంహరించాడు. ఆ ఇరువురు రాక్షసులను సంహరించిన శని ఇంకేమి చేయాలని ఋషులను అడగగా.. వారంతా శని ముందు సంతుష్టాంతరంగులై.. శనికి ఇవ్వవలసిన వరములిచ్చారు..

సంతుష్టుడై శని.. నా వారము రోజున (శనివారం) ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్థవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీడేరును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్థము ఈ శనైశ్చర తీర్థములలో ఎవరైతే స్నానము చేయుదురో.. వారి సమస్త కార్యములు నిర్విఘ్నముగా కొనసాగును.. శనివారము రోజున అశ్వత్థ ప్రదక్షిణములు చేసిన వారికి గ్రహపీడ కలుగదని హామీ ఇచ్చాడు. ఈ తీర్థము నందు అశ్వత్థతీర్థము, పిప్పలతీర్థము, సానుగ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్రిక తీర్థము, యగ్నిక తీర్థము, సాముగ తీర్థము వంటి మొదలైన పదునాలుగువేల నూట ఎనిమిది తీర్థములు ఉన్నాయని.. అక్కడ స్నానం చేయాలని సూచించారు.

శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వారికి.. సమస్త కోరికలు నెరవేరుతాయని.. తమ బాధ, ఇతర గ్రహపీడ కూడా ఉండదని మునులకు శని వరమిచ్చాడు. అంతట శనిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి.. శనేశ్వరుడని పేరు కూడా ఉంది. పిమ్మట ఈ మందేశ్వరునికి పక్కనే సప్తమాత్రుకలు వచ్చి.. శ్రీ పార్వతీదేవిని ప్రతిష్ఠించారు. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకటగు కర్కోటకుడను నాగు ఉంటాడు. అందుకే ఈశ్వరునికి నాగేశ్వరుడని పేరు వచ్చింది. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాలస్వామి మూర్తి ఉంటారు.

సమస్యలకుపరిష్కారమార్గం


మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులతో మనం బాధపడుతున్నా సరే ఒక పరిహారాన్ని కనుక మనం పాటిస్తే సమస్యలన్నీటినుండి మనం బయటపడేటటువంటి పరిహారం ఒకటి ఉంది.ఆ పరిహారం ఏమిటంటే కులదేవత ఆరాధన.ప్రతీ కులానికి ఒక అధిష్టాన దేవత ఒక కులదేవత ఉంటుంది.అటువంటి కులదేవత యొక్క ఆరాధన కనుక మీరు శ్రద్దగా ఒక పద్దతిగా చేశారంటే కులదేవత యొక్క అనుగ్రహం మీకు కలిగింది అంటే ఎటువంటి చికాకులు అయిన తొలగిపోతాయి.అదేవిధంగా ఈ కులదేవతల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారి యొక్క గృహమునందు కులదేవత స్థిరంగా కొలువై ఉంది వారి యొక్క జీవితాన్ని నిర్దేశించి మంచి మార్గములో వెళ్ళే విధంగా ఆశీర్వచనం చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.అందుకని కులదేవత ఆరాధన అమావాస్య రోజున మొదలుపెట్టి చేసుకోవాలి.అమావాస్య రోజున కులదేవతా యంత్రం మీద మీ కులదేవత ఎవరో ఆవిడ పేరు యంత్రం మీద ఎక్కడ ఉందో చూసుకుని కొద్దిగా పచ్చకర్పూరాన్ని,కొద్దిగా పన్నీరు చుక్క వేసి అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం ఏదైతే ఉంటుందో ఆ గంధాన్ని మీ కులదేవత యొక్క పేరు మీద రాయండి.అమావాస్య రోజున ప్రొద్దున్నే అంటే తెల్లవారుజామునే రాసిన తరువాత ఆ అమావాస్య రోజు వేపచిగుళ్ళు తీసుకువచ్చి మీ యొక్క కులదేవతకు అలంకరించండి.కొద్దిగా పసుపు కుంకుమ తీసుకుని మీ కులదేవత యొక్క పేరుతో పసుపు కుంకుమలతో పూజ చేయండి.తరువాత విధియ రోజున అల్లం ముక్కను తీసుకుని నైవేద్యం పెట్టండి.చవితి రోజున కొద్దిగా ఇంగువ తీసుకొని నైవేద్యంగా పెట్టండి.షష్టి రోజున కొంచం జీలకర్ర,అష్టమి నాడు కొంచం ఆవాలు,దశమి రోజున ఎండుమిరపకాయలు నైవేద్యంగా పెట్టండి.ఆ విధంగా మొదలుపెట్టి మీరు పౌర్ణమి వరకు కూడా ఒక రోజు విడిచిపెట్టి ఒక రోజు ఇంట్లోని పోపులపెట్టెలో ఉండేటటువంటి ఏదైతే సామగ్రి ఉందో వాటిని నివేదన చేసి మళ్ళీ అమావాస్య రోజు వచ్చేంతవరకు కూడా రోజు విడిచి రోజు ఏదో ఒక సామగ్రి నైవేద్యంగా పెట్టండి.ఆ తరువాత వీటన్నింటినీ తీసి ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అమావాస్య పూర్తైన తరువాత ప్రక్కకు పెట్టుకున్నటువంటి నైవేద్యాలన్నిటినీ కూడా ఆ నెల మొత్తం వంటకు ఉపయోగించండి.అదేవిధంగా మీరు కనుక 11 అమావాస్యల పాటు కులదేవతాయంత్రానికి కనుక ఆరాధన చేసి నివేదనలు చేసి ఆ నివేదనలను మీరు ప్రసాదంగా వంటలకు వినియోగించారంటే కులదేవత యొక్క అనుగ్రహం చేత మీ కులదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుస్తుంది.కులదేవతను మర్చిపోవడం వలన ఆవిడను పూజించాకపోవడం వలన మనం ఎన్నో సమస్యలను ఎదురుకుంటూ ఉన్నాము.అటువంటి సమస్యలన్నీ కూడా ఈ కులదేవత యొక్క ఆరాధన వలన తొలగిపోతాయి.సంతోషం అనేదటువంటిది కలుగుతుంది.కాబట్టి కులదేవత యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయండి.సంతోషంగా జీవించండి….

🚩సర్వేజనా సుఖినోభవంతు🚩